మంచు మనోజ్ నెక్ట్స్ కి రంగం సిద్దం...డిటేల్స్
హైదరాబాద్ : పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. ఫిబ్రవరి ఆరు నుంచి చిత్రం ప్రారంభం కానుంది. మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.
మోహన్బాబు కెరీర్లో కలికితురాయి లాంటి సినిమా 'పెదరాయుడు'.బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్కింగ్ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్ 'సన్నాఫ్ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ-''హాలీవుడ్లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్లో దర్శకత్వంలో శిక్షణ పొంది, హాలీవుడ్లో 'డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి, తెలుగులో 'కిక్' సురేందర్రెడ్డి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన పి.సాగర్ని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మంచు మనోజ్తో నిర్మిస్తున్న ఈ 'సన్నాఫ్ పెదరాయుడు' అతి త్వరలో ప్రారంభం అవుతుంది. మనోజ్ కెరీర్ని కొత్త మలుపు తిప్పే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అన్నారు.
ఇక 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా విడుదలైన రోజే పాజిటివ్ టాక్ రావడంతో పాటు, రివ్యూలు కూడా ఈ సినిమాకు అనుకూలంగా వచ్చాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో సినిమాకు ఆదరణ పెరుగుతోంది. 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ఫ్యామిలీ ప్యాకేజ్ అంటున్నారు సరదాగా. కానీ అక్క లేకపోవడం చిన్న మిస్సింగ్. అయితే అక్క లక్ష్మిపై ఓ పాటని రఫ్గా షూట్ చేశాం. దాన్ని పూర్తిగా చిత్రీకరించి సినిమాలో కలిపే ఆలోచన ఉంది అంటున్నారు మంచు మనోజ్.


Click it and Unblock the Notifications











