Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ ‘వేదం’పై మనోజ్ ఆరోపణ!
'గమ్యం" చిత్ర దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చాలా కాలం తర్వాత వస్తోన్న మల్టీస్టారర్ చిత్రంగా మంచి ప్రచారం పొందిన 'వేదం" మే 27న విడుదల కాబోతోంది. అల్లు అర్జున్, మనోజ్, అనుష్క ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం అంతా సవ్యంగానే జరిగి చిత్ర నిర్మాణం పూర్తయినట్లుగా కనిపిస్తున్నప్పటికీ 'వేదం" వెనక ఓ వివాదం రగులుతోందన్న వాస్తవం త్వరలో వెలుగులోకి రానుంది. ఈ చిత్రం కోసం మొదట అల్లు అర్జున్, అనుష్కలను ఎంచుకున్న క్రిష్ మరో ముఖ్య పాత్ర కోసం మనోజ్ ని సంప్రదించారు.
క్రిష్ చెప్పిన కథ, తన క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఓకే అన్న మనోజ్ ఇప్పుడు తెరపై సినిమా చూసుకుని తెల్లబోయాడట. కథ చెప్పినప్పుడు, షూటింగ్ చేసినప్పుడు తనపై వున్న సీన్స్ లో సగం మాత్రమే సినిమాలో పెట్టారని, తన క్యారెక్టర్ కి రెండు సోలో సాంగ్స్ వుంటాయని చెప్పి ఒకటే షూట్ చేశారని మండిపడుతున్న మనోజ్ 'వేదం" చిత్రాన్ని మల్టీస్టారర్ గా ప్రమోట్ చెయ్యడం ఆపి తనది కేవలం గెస్ట్ రోలో మాత్రమేనని మీడియాకి చెప్పుకుంటున్నాడట. బన్నీ, క్రిష్ ఒకటైపోయి 'వేదం" లో తన ప్రాధాన్యత తగ్గించేశారనేది మనోజ్ ఆరోపణ. ఇద్దరు యువ హీరోలు కలిసి సినిమా చేయడం ఇండస్ట్రీకి శుభ పరిణామం. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు-మోహన్ బాబు తనయుడు ఒకటవడం హర్షణీయం అన్న పరిశ్రమ వ్యక్తులందరూ 'వేదం" వెనుక రగులుతున్న ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో మరి.!