Don't Miss!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ దర్శకుడితో 6వ సారి వర్క్ చేయబోతున్న రవితేజ.. మరో బిగ్ బడ్జెట్ మూవీ?
మాస్ మహరాజా రవితేజ చాలా కాలం తరువాత బాక్సాఫీస్ వద్ద ఒక బిగెస్ట్ హిట్ అందుకున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా సంక్రాంతి సీజన్ లో అత్యదిక వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆపసోపాలు పడి థియేటర్స్ లోకి వచ్చింది. ఇక రవితేజ ఖిలాడి అనంతరం అగ్ర దర్శకులను లైన్ లో పెట్టబోతున్నాడు. రవితేజకు ఇష్టమైన దర్శకుడితో 6వ సారి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
క్రాక్.. మొత్తం వచ్చిన లాభం ఎంతంటే
క్రాక్ ను ఆలస్యంగా రిలీజ్ చేసినా కూడా ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. దాదాపు 36కోట్లకు పైగా షేర్స్ ను అందించింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17.5కోట్లు. ఇక సినిమా టోటల్ షేర్ ప్రాఫిట్ ఎంతంటే 19.22 కోట్లు. ఈ రేంజ్ లో రబితేజ ఎప్పుడు లాభాలను అందుకోలేదు. మొత్తానికి సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇష్టమైన దర్శకుడితో మరోసారి
అయితే చాలా కాలం తరువాత రవితేజ తనకు ఇష్టమైన దర్శకుడితో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న పూరి ప్రస్తుతం లైగర్ సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఆ పాన్ ఇండియా అనంతరం వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.
ఒకప్పుడు హ్యాట్రిక్ హిట్స్..
రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మొత్తంగా 5 సినిమాలు వచ్చాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలతో మొదటి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత చేసిన నేనింతే సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక చివరగా దేవుడు చేసిన మనుషులు సినిమాతో వచ్చారు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
లైగర్ పూర్తయిన తరువాత..
ఇక మళ్ళీ 9 ఏళ్ళ తరువాత ఈ ఇద్దరు మరో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ సినిమా నెవర్ బిఫోర్ అనేలా బిగ్ బడ్జెట్ తో తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక పూరి లిస్ట్ లో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ ముందుగా ఎవరితో వర్క్ చేస్తాడో క్లారిటీ ఇవ్వలేదు. లైగర్ పూర్తయిన తరువాతనే భవిష్యత్తు ప్రాజెక్టులపై వివరణ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.