Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ గోపాల్ వర్మ తెలుగువారికి ఇచ్చిన గౌరవం ఇదేనా..!?
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో గొడవలో ఉంటూనే ఉంటాడు. పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా ఏదో విధంగా పాపులారిటీ రావాలనేది ఆయన తత్త్వం అని ఇండస్ట్రీలో ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. తెలుగువాడు బాలీవుడ్ హవా చేస్తున్నాడని ప్రమోట్ చేసిన మీడియాకు వర్మ షాక్ ఇస్తే.... మీడియా కూడా చూసి చూసి షాక్ ఇచ్చింది. ఇటీవలే టీవీ9లో ఆయనపై నెగెటివ్ టాక్ తో దాడిచేస్తే...అదంతా ఒక డ్రామా అని తెలిసి..వర్మను ప్రింట్ మీడియా అడిగింది..కేసు పెడతానన్నారు. ఇంకా పెట్టలేదు ఏమిటని..? అసలు ఇదంతా మీకు సన్నిహితులైన జర్నలిస్టుల చేత నెగెటివ్ గా ప్రచారం చేయించారని తెలిసిందని అడిగితే...కాసేపు ఆలోచించి.. అలా కూడా అనుకుంటున్నారా? అని వర్మ స్టైల్ లో దాటవేశారు.
ఇదిలా ఉండగా బుధవారం.. ఆయన 'దొంగలముఠా' ఆఫీసుకు రమ్మని కొంతమంది మీడియా మిత్రులను ఆహ్వానించారు. చెప్పిన టైమ్ కు గంట దాటినా ఆయన జాడ లేదు. ఓ సీనియర్ ఇదేమిటని ఫోన్లో సంప్రదిస్తే... వేరే పనిపై బిజీగా ఉన్నాను. మీరు అందరూ అక్కడే వెయిట్ చేయండని తాపీగా జవాబు చెప్పారట. దీంతో అహం దెబ్బతిన్న మీడియా మిత్రులు శాపనార్థాలు పెడుతూ వర్మ మీట్ ను బాయ్కాట్ చేశారు. ఇదే బాలీవుడ్ లో అయితే నానారకాలుగా రాస్తారనీ, తెలుగు మీడియా చెప్పినట్లు రాస్తుందని అంటుండే రామ్ గోపాల్ వర్మ తెలుగువారికి ఇచ్చిన గౌరవం ఇదేనా..!