Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరో సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం.. ఆగిపోయినట్లే.. ఫ్యాన్స్ హ్యాపీ?
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో ఎవరూ ఊహించని విధంగా అతి పెద్ద డిజాస్టర్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో మెగాస్టార్ మరింత జాగ్రత్తలు తీసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ఇదివరకే ఒక సినిమాను మెగాస్టార్ క్యాన్సిల్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమాను కూడా ఆయన వదిలేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ రేంజ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చి తన రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని బాక్సాఫీస్ కలెక్షన్స్ తో నిరూపించాడు. తర్వాత మాత్రం కూడా సైరా సినిమాతో చరిత్రాత్మక అంశాన్ని ప్రెజెంట్ చేసి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమా పూర్తి స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక మళ్లీ కమర్షియల్ గానే సినిమాలు చేస్తే బెటర్ అని వరుసగా కొన్ని సినిమాలను లైన్లో పెట్టారు.
ఊహించని దెబ్బ
ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని అని అనుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కడం అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరొక స్టార్ హీరోగా నటించడం.. ఇలా ఆ సినిమాకు అన్నీ పాజిటివ్ అంశాలు కలిసి వస్తాయి అని అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదల అనంతరం ఊహించని దెబ్బ పడింది.
భారీగా నష్టాలు
ఆచార్య సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివకు ఊహించని విధంగా బ్రేక్ అయితే పడింది. ఇక కమర్షియల్ గా ఈ సినిమా దాదాపు 70 కోట్లకుపైగా నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. ఇంకా అందులో సగం వరకు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ డిస్ట్రిబ్యూటర్స్ కు సెటిల్మెంట్ చేసినట్లు తెలుస్తోంది.
అలా సినిమాలు చేస్తే.. కష్టమే..
అయితే మెగాస్టార్ కమర్షియల్ గా సినిమాలు చేస్తే ఈ రోజుల్లో సక్సెస్ అవడం కష్టం అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ అలా అనుకున్న ప్రతిసారి మెగాస్టార్ మరో సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే కొన్ని సినిమాలను ముందుగా ఆపేస్తేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చర్చ లో ఉన్న వెంకీ కుడుముల ప్రాజెక్టు ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. కానీ ఆ దర్శకుడు మాత్రం మెగాస్టార్ తో సినిమా ఉంటుంది అని వివరణ ఇచ్చాడు.
బోళా శంకర్ క్యాన్సల్?
మరొక వైపు మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాను కూడా మధ్యలోనే ఆపేసినట్లు తెలుస్తోంది. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న పక్కా కమర్షియల్ మాస్ మూవీ వేదళం సినిమాకు రీమేక్ గా కాబోతున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమా షూటింగ్ ను కొంతవరకు పూర్తి చేశారు. ఇక ఆచార్య లాంటి సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఈ కమర్షియల్ ఈ మూవీని చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఆలోచనలో వచ్చినట్లు తెలుస్తోంది.
ఫ్యాన్స్ హ్యాపీ
ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి నిజంగానే మెహర్ రమేష్ సినిమాను మధ్యలోనే వదిలేస్తే ఆనందించాల్సిన విషయమే అని ఓ వర్గం అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో కానీ మెహర్ రమేష్ తో సినిమా చేయడం అంటే చాలా రిస్క్ అని చెబుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ దర్శకుడు వరుసగా షాడో, శక్తి సినిమాలతో ఊహించని అపజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ అతనితో సినిమా ఎందుకు చేస్తున్నారు అని కూడా మొదట అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా అగిపోయింది అని తెలియడంతో మెగా నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.