Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగాస్టార్ చిరంజీవి రీమేక్ మూవీ.. అవన్నీ అబద్ధాలేనట.. ముహూర్తం ఫిక్స్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా స్టార్ట్ చేసిన కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటారు. ప్రస్తుతం ఆయన లైన్ లో పెట్టిన సినిమాలను కూడా ఎలాగైనా పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ముందుగా కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే తుది దశలో ఉన్న ఆచార్య షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.
థియేటర్స్ అయితే ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా లేవు. ఇక ఆచార్య విడుదలపై కూడా ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. ఇక ఆ సినిమా రిలీజ్ ఆలస్యం అయినా సరే కూడా లాక్ డౌన్ అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఆ సినిమా మరేదో కాదు. లూసిఫర్ రీమేక్. రామ్ చరణ్ నిర్మాతగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇటీవల కొన్ని ఊహించని రూమర్స్ వైరల్ అయ్యాయి.
దర్శకుడు కథను సరైన క్రమంలో సెట్ చేసుకోలేదని మెగాస్టార్ అభ్యంతరం చెప్పడంతో మోహన్ రాజా డ్రాప్ అయినట్లు గాసిప్స్ బాగానే వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మోహన్ రాజా స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ చాలా సంతృప్తి చెందినట్లు సమాచారం. ఇక లాక్ డౌన్ పూర్తయిన వెంటనే సినిమాను లాంచ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే దర్శకుడు హీరోయిన్, నటీనటుల సెలక్షన్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక మెగాస్టార్ తో మరొకసారి మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఎలాగైనా వచ్చే ఏడాది ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మెగాస్టార్ అడుగులు వేయబోతున్నారు.