Don't Miss!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మెగాస్టార్ చిరంజీవితో వినాయక్ మీటింగ్.. ఆ రీమేక్ కోసమేనా?
మెగాస్టార్ చిరంజీవి కూడా యువ హీరోల కంటే జెట్ స్పీడ్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దెబ్బపడింది గాని లేకుంటే ఈపాటికే ఆచార్యతో సిద్ధమై మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేవారు. ఇక భవిష్యత్తు ప్రాజెక్టుపై ఏ మాత్రం ఆలస్యం చేయకుడదని మెగాస్టార్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా సగం ఫినిష్ చేయాల్సి ఉంది. ఇక నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా కమిట్ అయినట్లు ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ తో క్లారిటీ వచ్చేసింది. అయితే లూసిఫర్ రీమేక్ కోసం మెగాస్టార్ వినాయక్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇటీవల బెంగుళూరుకు వెళ్లిన మెగాస్టార్ అక్కడ వినాయక్ తో మీటింగ్ సెట్ చేసుకున్నట్లు టాక్. ఇద్దరు గంటల తరబడి ఆ మలయాళం రీమేక్ పై చర్చలు జరిపినట్లు సమాచారం. మెగాస్టార్ తో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న వినాయక్ ప్రస్తుతం సక్సెస్ లేక అవకాశాలు అందుకోవడం లేదు. ఇక ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ తో చర్చలు జరిపి ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ముందుగా ఆచార్యను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి బాబీతో గాని మెహర్ రమేష్ తో గాని సినిమాను స్టార్ట్ చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారు. ఇక లుసిఫర్ కి గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేయడానికి మరో ఏడాది సమయమైనా పట్టవచ్చని తెలుస్తోంది.