Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ టైటిల్.. ఫిక్స్ అయినట్లే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో గాని రాజకీయాల్లో బిజీ పర్సన్ అయినప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. నిజంగా పవన్ ఈ రేంజ్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడాని ఎవరు ఊహించలేదు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ విడుదలకు సిద్దమవుతుండగానే మరో సినిమాకు ఒకే చెప్పారు.
దసరా సందర్భంగా మలయాళం రీమేక్ అయ్యప్పన్ కొశీయుమ్ కథకు ఒప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అప్పట్లో ఒక్కడుండేవాడు అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు సాగర్ చంద్ర ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఆ సినిమాకు మెగాస్టార్ ఓల్డ్ మూవీ టైటిల్ ని సెట్ చేయాలని అనుకుంటున్నారట. 1982లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన చిత్రం బిల్లా రంగా. ఇక ఆ సినిమా టైటిల్ ని ఈ మలయాళం రీమేక్ కోసం వాడనున్నారట.
ఇక మరో హీరో రానా దగ్గుబాటి పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సినిమాను ఒరిజినల్ కథలా కాకుండా తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా దర్శకుడు సరికొత్తగా మళ్ళీ రీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాగర్ చిన్న దర్శకుడే అయినప్పటికీ అతను స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్న విధానంపై నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.