Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ ఇద్దరు యువ దర్శకులకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్..నెలాఖరుకే లూసిఫర్ జాతకం తేలేది
మెగాస్టార్ చిరంజీవి వయసుతో సంబంధం లేకుండా యమ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ అన్నయ్య ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నాడు అంటూ అభిమానులు కూడా పాజిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు. సైరా యాక్షన్ సీన్స్ లో కూడా దాదాపు డూబ్ లేకుండానే రిస్క్ చేశారు. సర్జరీలు అయినప్పటికీ పెద్దగా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న మెగాస్టార్ నెక్స్ట్ ఎవరు ఊహించని విధంగా ప్లాన్ అమలు చేయబోతున్నాడు.
Recommended Video
కొరటాలతో ఆచార్య..
బాక్సాఫీస్ దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ని వేగంగా మొదలుపెట్టిన మెగాస్టార్ వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమాకు సడన్ గా బ్రేకులు పడ్డాయి. లాక్ డౌన్ అనంతరం వెంటనే సినిమాను పూర్తి చేయాలని మెగాస్టార్ మరో షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నారు.
సాహూ దర్శకుడిపై నమ్మకం..
ఆచార్యతో పాటు లూసిఫర్ రీమేక్ ని కూడా వెంటనే పూర్తి చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా సుజిత్ ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. సాహూ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా దర్శకుడు సుజిత్ పై మెగాస్టార్ చాలా నమ్ముతున్నాడు. దర్శకుడు కూడా తనదైన శైలిలో మెగాస్టార్ ఇచ్చిన ఛాన్స్ కి న్యాయం చేయాలని కష్టపడుతున్నాడు.
చిరు చివరి ఛాన్స్..
మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు సుజిత్ ఇప్పటికే కొన్నిసార్లు సినిమాకు సంబంధించిన పాయింట్స్ గురించి చెప్పాడట. ఇక రెండుసార్లు ఫుల్ స్క్రిప్ట్ వినిపించగా కొన్ని చిరు మార్పులు అవసరమని అన్నారట. మరికొన్ని రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ చెప్పమని మరొక ఛాన్స్ ఇచ్చారు. ఈసారి సుజిత్ మెప్పించగలిగితే అగ్రిమెంట్ చేసుకొని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారట.
మెగాస్టార్ రిస్క్ చేస్తున్నాడా?
సైరా సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాలతో తప్పకుండా సేఫ్ జోన్ లో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సుజిత్ లాంటి డైరెక్టర్ చేతిలో 100కోట్ల ప్రాజెక్ట్ ని పెట్టడం రిస్క్ అనే కామెంట్స్ వస్తున్నాయి. సాహూ సినిమా నార్త్ లో ఆడినప్పటికి తెలుగులో వర్కౌట్ కాలేదు. ఆ ఎఫెక్ట్ సుజిత్ నెక్స్ట్ సినిమాపై ఎంతో కొంత పడే అవకాశం లేకపోలేదు. అందుకే చిరంజీవి రిస్క్ చేస్తున్నాడని కథనాలు వెలువడుతున్నాయి.
బాబితో మరో సినిమా..
కొరటాల శివ, సుజిత్ సినిమాలతో పాటు మరొక దర్శకుడు చెప్పే కథకు కూడా మెగాస్టార్ ఈ నెలాఖరులోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట. జై లవకుశ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న బాబీ ఇప్పటికే ఒక కొత్త కథను సెట్ చేసుకున్నాడు. మెగాస్టార్ కి కూడా వినిపించినట్లు సమాచారం. కుదిరితే ఈ నెలాఖరులోగా ఆ కథపై మెగాస్టార్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.