Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జూ. ఎన్టీఆర్ దర్శకుడుతో మహేష్ బాబు చిత్రం కన్ఫర్మ్
గాలివార్త నిజమైంది. మెహర్ రమేష్..మహేష్ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. ఎన్టీఆర్ తో 'కంత్రి' రూపొందించి ప్రస్తుతం 'శక్తి' చిత్రం డైరక్ట్ చేస్తున్న మెహర్ రమేష్ ..తాజాగా మహేష్ బాబుకి ఓ కథ చెప్పి ఒప్పించాడని సమాచారం. భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. మే 2011 నుంచీ ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు..దూకుడు చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకుని చేసిన ఖలేజా వర్కవుట్ కాకపోవటంతో కంటిన్యూగా సినిమాలు చేయాలని నిర్ణయానికి వచ్చి ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ తో చేయనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ డిసెంబర్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. అలాగే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ లోగా శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో ఢమురుకం అనే టైటిల్ లో నాగార్జున హీరోగా సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.