Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ. ఎన్టీఆర్ దర్శకుడుతో మహేష్ బాబు చిత్రం కన్ఫర్మ్
గాలివార్త నిజమైంది. మెహర్ రమేష్..మహేష్ కాంబినేషన్ కన్ఫర్మ్ అయింది. ఎన్టీఆర్ తో 'కంత్రి' రూపొందించి ప్రస్తుతం 'శక్తి' చిత్రం డైరక్ట్ చేస్తున్న మెహర్ రమేష్ ..తాజాగా మహేష్ బాబుకి ఓ కథ చెప్పి ఒప్పించాడని సమాచారం. భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. మే 2011 నుంచీ ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు..దూకుడు చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకుని చేసిన ఖలేజా వర్కవుట్ కాకపోవటంతో కంటిన్యూగా సినిమాలు చేయాలని నిర్ణయానికి వచ్చి ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఇక ప్రముఖ దర్శకుడు శంకర్ తో చేయనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ డిసెంబర్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. అలాగే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ లోగా శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో ఢమురుకం అనే టైటిల్ లో నాగార్జున హీరోగా సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.