Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి కోసం రిస్క్ చేసిన మెహర్ రమేశ్: స్వయంగా ఖర్చు పెట్టి మరీ చిత్రీకరణ
గతంతో పోలిస్తే రీఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆయన.. ప్రస్తుతం కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ పూర్తి కాకముందే మరిన్ని చిత్రాలను ప్రకటించారు. అందులో తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'వేదాళం' మూవీకి రీమేక్ కూడా ఉంది. ఈ చిత్రం ద్వారా ఫ్లాప్ దర్శకుడిగా ముద్ర పడిన మెహర్ రమేశ్ సుదీర్ఘ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక, తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ తాజాగా ఫిలిం నగర్లో వైరల్ అవుతోంది.
'ఆచార్య' తర్వాత మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్లో నటించబోతున్నారు. దీని తర్వాత వేదాళం మూవీ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది. అంటే దీనికి చాలా సమయమే ఉంది. అయినప్పటికీ చిరును మెప్పించడం కోసం మెహర్ రమేశ్ గత ఏడాది కోల్కతా వెళ్లి మరీ కొన్ని శాంపిల్ షాట్స్ను తెరకెక్కించినట్లు తాజాగా తెలిసింది. దసరా సమయంలో అక్కడ కుంభమేళా జరుగుతుంది. అందుకే అక్కడ ఈ సన్నివేశాలు చిత్రీకరించాడట. ఇందుకోసం ఈ దర్శకుడు ఏకంగా రూ. 30 లక్షలు కూడా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ చిరంజీవికి బాగా నచ్చాయని కూడా తెలుస్తోంది.
కోల్కతాలో చేసిన సీన్స్పై చిరంజీవి సంతృప్తిగా ఉండడంతో పాటు మెహర్ పనితీరును అభినందించారనే టాక్ వినిపిస్తోంది. దీంతో అతడు మరింత జోష్తో ఈ సినిమాను రూపొందించబోతున్నాడని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో చిరంజీవి గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటింబోతుంది. ఆమెతో పాటు సాయి పల్లవి కూడా ఎంతో ముఖ్యమైన పాత్రను చేస్తుందని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.