Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నరుకుతానంటూ మోహన్ బాబు వార్నింగ్!?
సెల్ ఫోన్ల వల్ల సినిమాలోని సీన్లు, సినిమాకు సంబంధించిన సమాచారం బయటకు లీక్ అవుతుందనే భయంతో....ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన ఈ బోర్డు పెట్టించినట్లు స్పష్టం అవుతోంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దాసరి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ సంస్థపై మంచు విష్ణు, మనోజ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లతో పాటు వరుణ్ సందేశ్, తనీష్లు కూడా నటిస్తున్నారు. విష్ణు, మనోజ్ సరసన హన్సిక, ప్రణీత హీరోయిన్స్. మంచు విష్ణు గతంలో ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ''మేమిద్దరం హీరోలుగా నిలదొక్కుకోవడానికి డాడీయే స్ఫూర్తి. ఆయన శ్రమ మమ్మల్ని నిలబెట్టింది. ఇప్పుడు డాడీ హీరోగా మేం సినిమాను నిర్మించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించబోతున్నామనే విషయం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆద్యంతం వినోదాన్ని పంచే కుటుంబ కథా చిత్రమిది'' అన్నారు.
ఎన్నో ప్రత్యేకతలతో, ఇంతవరకూ తెలుగులో రానివిధంగా ఈ చిత్రం నిర్మాణం కాబోతోంది. ఇది ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్. మాకు సినీ జన్మను ప్రసాదించిన మా తండ్రి మోహన్బాబుతో మొదటిసారి మేం నిర్మిస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలనూ మించి ఉంటుందని చెప్పుకొచ్చారు. రచన: గోపీ మోహన్, కోన వెంకట్, బీవీయస్ రవి, ఛాయాగ్రహణం: పళనికుమార్, సమర్పణ: అరియానా, వివియానా.