Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ స్క్రిప్టు పవన్ కాదంటే మహేష్ కొచ్చిందా?
కిక్ హిట్ తో విజయోత్సాహంలో ఉన్న సురేంద్ర రెడ్డి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ఓ కథను వినిపించాడని సమాచారం. వక్కంతం వంశి తయారు చేసిన ఆ కథ పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంది. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ నిరాకరించి రెండేళ్ళ వరకూ డేట్స్ ఖాలీ లేవని చెప్పి పంపారు. దాంతో ఆ కథని మరో ప్రముఖ హీరో మహేష్ బాబుకు చెప్పారు. విన్న మహేష్ బావుందని మరింత స్క్రిప్టు వర్క్ తో రమ్మని చెప్పారుట. అతిధి ప్లాప్ ని బాలన్స్ చేయటానికే సురేంద్ర రెడ్డి ఈ స్క్రిప్టు వినిపించానని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. ఇక ఏడాదికి రెండు సినిమా చేద్దామని డిసైడ్ అయిన మహేష్ వరసగా ఖాలీ దొరికినప్పుడల్లా కథలు వింటున్నారు. ఇక ఈ చిత్రానికి మిస్టర్ ఫెరఫెక్ట్ అనే టైటిల్ సైతం పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చి్త్రం పూర్తయిన వెంటనే సురేంద్రరెడ్డి ప్రాజెక్టు స్టార్టయ్యే అవకాశముందని వినికిడి.