Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ స్క్రిప్టు పవన్ కాదంటే మహేష్ కొచ్చిందా?
కిక్ హిట్ తో విజయోత్సాహంలో ఉన్న సురేంద్ర రెడ్డి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ఓ కథను వినిపించాడని సమాచారం. వక్కంతం వంశి తయారు చేసిన ఆ కథ పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంది. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ నిరాకరించి రెండేళ్ళ వరకూ డేట్స్ ఖాలీ లేవని చెప్పి పంపారు. దాంతో ఆ కథని మరో ప్రముఖ హీరో మహేష్ బాబుకు చెప్పారు. విన్న మహేష్ బావుందని మరింత స్క్రిప్టు వర్క్ తో రమ్మని చెప్పారుట. అతిధి ప్లాప్ ని బాలన్స్ చేయటానికే సురేంద్ర రెడ్డి ఈ స్క్రిప్టు వినిపించానని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. ఇక ఏడాదికి రెండు సినిమా చేద్దామని డిసైడ్ అయిన మహేష్ వరసగా ఖాలీ దొరికినప్పుడల్లా కథలు వింటున్నారు. ఇక ఈ చిత్రానికి మిస్టర్ ఫెరఫెక్ట్ అనే టైటిల్ సైతం పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చి్త్రం పూర్తయిన వెంటనే సురేంద్రరెడ్డి ప్రాజెక్టు స్టార్టయ్యే అవకాశముందని వినికిడి.