twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ స్క్రిప్టు పవన్ కాదంటే మహేష్ కొచ్చిందా?

    By Srikanya
    |

    కిక్ హిట్ తో విజయోత్సాహంలో ఉన్న సురేంద్ర రెడ్డి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ఓ కథను వినిపించాడని సమాచారం. వక్కంతం వంశి తయారు చేసిన ఆ కథ పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంది. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ నిరాకరించి రెండేళ్ళ వరకూ డేట్స్ ఖాలీ లేవని చెప్పి పంపారు. దాంతో ఆ కథని మరో ప్రముఖ హీరో మహేష్ బాబుకు చెప్పారు. విన్న మహేష్ బావుందని మరింత స్క్రిప్టు వర్క్ తో రమ్మని చెప్పారుట. అతిధి ప్లాప్ ని బాలన్స్ చేయటానికే సురేంద్ర రెడ్డి ఈ స్క్రిప్టు వినిపించానని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. ఇక ఏడాదికి రెండు సినిమా చేద్దామని డిసైడ్ అయిన మహేష్ వరసగా ఖాలీ దొరికినప్పుడల్లా కథలు వింటున్నారు. ఇక ఈ చిత్రానికి మిస్టర్ ఫెరఫెక్ట్ అనే టైటిల్ సైతం పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చి్త్రం పూర్తయిన వెంటనే సురేంద్రరెడ్డి ప్రాజెక్టు స్టార్టయ్యే అవకాశముందని వినికిడి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X