Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జూ ఎన్టీఆర్, గుణశేఖర్ లపై విమర్శలు చేసినందుకేనా ఆ నిర్ణయం?
ప్రముఖ నిర్మాత, కవి, ఎమ్.ఎస్ రెడ్డి(అరుంధతి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి) రీసెంట్ గా తన ఆత్మకథను రాసారు. ఆ పుస్తకం పేరు ఇదీ నా కథ. ఈ పుస్తకం మీడియాలో ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. అందుకు కారణం ఆ పుస్తకంలో పెద్ద ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్, గుణశేఖర్ వంటి కొందరుపై ఆయన డైరక్ట్ గా విమర్శలు గుప్పించారు. దాంతో పరిశ్రమలో ఓ వర్గం ఈ విషయం తీవ్రంగా పరిగణించటం జరిగింది. ఇది గమనించిన ఆయన కుమారుడు పరిశ్రమలో ఉన్న పరిచయాలు దెబ్బ తింటాయని వెంటనే ఆ పుస్తకం ప్రతులన్నీ మొత్తం వెనక్కి తెప్పించేసారు. ఒక్క పుస్తకం కూడా మార్కెట్లో దొరకటం లేదు. అలాగే మీడియా వారి వద్ద కూడా ఈ పుస్తక విషయమై మాట్లాడవద్దని తండ్రికి గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇక ఎమ్.ఎస్ రెడ్డి మల్లెమాలగా బాగా సుప్రసిద్దులు. వీరి బ్యానర్ లో బాలరామాయణం చిత్రం గుణశేఖర్ చేసారు. అందులో రాముడుగా జూ.ఎన్టీఆర్ నటించారు.