Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Ram Charan పాన్ ఇండియా మూవీ.. మ్యూజిక్ ఇచ్చేది ఒక్కరు కాదు!
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ కాంబినేషన్ పై మొదట్లో రూమర్స్ వచ్చినప్పుడు నమ్మడానికి కొంచెం కష్టంగానే అనిపించింది. అబద్దం అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఫైనల్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది.
శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల అంచనాలను అందుకునేలా ఉండాలని భారీగా ఖర్చు చేస్తాడని అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాను కూడా కాస్ట్లీగానే ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 150కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని సమాచారం. సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాపై మరింత అంచనాలు పెంచే మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ సెలెక్ట్ అయినట్లు మొన్నటి వరకు కథనాలు రాగా ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ అందిస్తారని మరొక స్టోరీ వైరల్ అవుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా కొన్ని పాటలు ఇస్తాడాని అంటున్నారు. ఇదే నిజమైతే సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ తోనే ఈ స్టార్స్ బజ్ క్రియేట్ చేయడం కాయం.