Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముమైత్ నిర్మాత ఆత్మహత్యాయత్నం
ముమైత్ ఖాన్ కథానాయికగా వచ్చిన సినిమా 'టార్గెట్'. రమేష్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంగిశెట్టి దశరథ్ నిర్మంచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో నిర్మాత దశరథ్ అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఫైనాన్స్ చేసిన రామకృష్ణ, ల్యాబ్ ఇన్ చార్జ్ కళ్యాణ్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా దశరథ్ పై ఒత్తిడి తెచ్చారు.
దీంతో ఈ ఒత్తిడి తట్టుకోలేని దశరథ్ రెండు రోజుల ముందు ఒక లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుండీ వెళ్లిపోయారు. ఈ ఉత్తరం చూసి ఆయన కుటుంబసభ్యలు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారట. పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, తాజాగా దశరథ్ ఆత్మహత్యాయత్నం చేసారన్న వార్త బలంగా వినిపిస్తోంది. సినిమాలు జాగ్రత్తగా తీయకుండా, సరిగా మార్కట్ చేసుకోలేని వారికి ఈ ఉదంతం ఓ గుణపాఠం లాంటిది. ఇంతకు ముందు ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'నరసింహుడు' సినిమా నిర్మాత చెంగల వెంకట్రావ్ కూడా ఇదే విధంగా సినిమాను సరైన సమయంలో సినిమాను విడుదల చెయ్యలేక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసారు.