Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీడియాని ఇరికిద్దామని దర్శకుడు ఎన్. శంకర్ ప్రయత్నం
'జైభోలో తెలంగాణా' షూటింగ్ చివర రోజు మీడియాకు ట్విస్ట్ ఇద్దామని దర్శకుడు ఎన్. శంకర్ ప్రయత్నించాడు.అయితే సీన్ రివర్స్ అయింది. ఈ చిత్రం ఆఖరిరోజు షూటింగ్కు మీడియాను పిలిపించారు.హైదరాబాద్ లోని రాక్కాజిల్ హోటల్లో చివరి షాట్లు తీస్తున్నారు. మీడియా వచ్చి రెండుగంటలైనా పట్టించుకోలేదు. వారు వెళ్ళపోవటానికి రెడీ అవుతూంటే... ఛానల్స్వారు బైట్కావాలంటే.. నటీనటుల్ని తీసుకోవాలని ఎన్. శంకర్ చెప్పాడు.
దీంతో మీడియావారు హడావుడిగా వెళ్ళి ఆసుపత్రిబెడ్సీన్లో వున్న నటీనటులపై షూట్ చేయటం ప్రారంభించాడు. ఆ ఆర్టిస్టులను మీడియా వారిని కొన్ని ప్రశ్నలు అడగమని శంకర్ చెప్పాడు. దానికి నటీనటులుసమాధానం చెబుతారన్నారు.అయితే అదంతా షూట్ చేయటానికి ప్రయత్నించాడు. దాంతో అసలు విషయం మీడియావారికి అర్దమై మైకులు తీసేసి బాయ్ కాట్ చేసారు.
అసలు విషయం ఏమంటే.. సినిమాలో ఎలక్ట్రానిక్ మీడియాని విమర్శిస్తూ కొన్ని సీన్స్ వున్నాయి. నిజానికి అవి చిత్రీకరించాలంటే ముందుగా ఛానల్ వారి పర్మిషన్ అడిగి సింబల్స్ తీసుకోవాలి.అయితే శంకర్ అదంతా అనవసరం అనుకున్నట్లున్నారు.. .. మీడియా సమావేశం పేరుతో అందరినీ పిలిచి ఇలా ట్విస్ట్ ఇవ్వాలని . అసలే వివాదాస్పద కథతో కూడుకున్న చిత్రం కనుక రేపు రిలీజయ్యాక తమ ఉద్యోగాలకు ఇబ్బందవుతుందని గ్రహించిన మీడియావారు..శంకర్ ని ఇలా చేయవద్దని కొంచెం గట్టిగానే చెప్పి వచ్చేసారు.
ఇక ఈ 'జైభోలో తెలంగాణా' అంటూ తెలంగాణా అమరవీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్న చిత్రం డిసెంబర్ 31న విడుదల కావాల్సి వుంది. కానీ షూటింగ్ లేటవటంతో వాయిదా పడింది. అలాగే ఈ సినిమాలో తెలంగాణా వస్తున్నట్లుగా చూపించేప్రయత్నం చేశారు. కానీ మరలా మనస్సు మార్చుకుని త్వరలో వస్తుందనేట్లుగా రీ ష్యూట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ ..తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అన్నారు