Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా మేనల్లుడితో నభా నటేష్ రొమాన్స్! ఇదీ అసలు విషయం
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గ్లామర్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది నభా నటేష్. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసి వెండితెర విందు ఇచ్చింది నభా. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ దర్శకనిర్మాత చూపు ఆమెపై పడింది. ఈ నేపథ్యంలోనే నభా నటేష్ తాజాగా మెగా మేనల్లుడితో రొమాన్స్ చేసే ఛాన్స్ పట్టేసింది తెలుస్తోంది.
గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నింటిపై స్పెషల్ కేర్ తీసుకుంటూ ఈ ఏడాది భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో నభా నటేష్ హీరోయిన్గా చేస్తే బాగుంటుందని సూచించాడట సాయి ధరమ్. ఆయన సూచనా మేరకు చిత్రయూనిట్ నభా నటేష్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రతిరోజూ పండుగే' సినిమాతో బిజీగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే నవంబర్ నెలలో సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నాడట ఈ మెగా మేనల్లుడు. దీంతో పాటు దేవాకట్టా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. మొత్తంగా చూస్తే 2020 సంవత్సరంలో సాయి ధరమ్ తేజ్ సినిమాల పండగ రానుందని తెలుస్తోంది.