Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఈవెంట్ మేనేజర్ గా నాగార్జున..కథేమిటంటే...
హైదరాబాద్ : నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున ఈవెంట్ మేనేజర్ గా కనిపించనున్నారని సమాచారం. అలాగే హీరోయిన్ నయనతారది పిల్లల వైద్యనిపుణురాలి పాత్ర. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు యువతరాన్ని ఓ రేంజ్లో అలరిస్తాయని చెప్తున్నారు. మన్మధుడు చిత్రం తరహాలో సీన్స్ ఫన్నీగా ఉంటాయని అంటున్నారు.
కథ ప్రకారం..ఈవెంట్ మేనేజర్ గా చేస్తున్న నాగార్జున...అక్కడ ఓ ఈవెంట్ లో భారీగా దెబ్బతినటంతో ఇండియాలో ఉన్న తన ఆస్తిని అమ్మి రికవరీ చేసుకుందాని వస్తారు. ఈ జర్నిలో నయనతార పరచయమవుతుంది. అక్కడనుంచి ఆమెతో నాగార్జున పరిచయం ఎలా ముందుకెళ్లింది. డబ్బే లోకంగా బ్రతికే నాగార్జున...కుటుంబ విలువలు,ప్రేమ వంటివాటికి ప్రయారిటి ఇవ్వాలని ఎలా తెలుసుకున్నాడు వంటి విషయాలతో సినిమా నడుస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ చిత్రం 12 రోజుల టాకీ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు మిగిలిన టాకీని పూర్తి చేస్తారని తెలిసింది. ఇందులో ఉండే ఆరు పాటల్లో అయిదు పాటల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన ఒక్క పాటను నాగ్, నాయనతారపై త్వరలోనే చిత్రీకరించనున్నారు.
హైదరాబాద్, యూరప్, అమెరికా, బ్యాంకాక్ లాంటి అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాకు 'లవ్స్టోరీ' అనే టైటిల్ని నిర్ణయించినట్లుగా గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడేమో... 'సరిలేరు నీకెవ్వరూ' అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు టైటిల్సూ కాదని, ఈ వారంలోనే అసలు టైటిల్ని ప్రకటిస్తారని సమాచారం.
దశరథ్, నాగార్జున కాంబినేషన్లో పదకొండేళ్లక్రితం వచ్చిన 'సంతోషం' చిత్రం మించి ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.శివప్రసాద్రెడ్డి నిర్మిస్తున్నారు. చాలాకాలం తర్వాత నాగ్ ప్రేమకథలో నటించటం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.