Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రెడీ అవుతున్న నాగ్ అశ్విన్.. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు!
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా మారాడు నాగ్ అశ్విన్. నాని హీరోగా, విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలో నటించిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ అభిరుచిని చాటి చెప్పింది. ఆపై మహానటి సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు.
మహానటితో దర్శకుడిగా ఓ గౌరవాన్ని సంపాదించుకున్నాడు. మహానటి సావిత్రికి నిజమైన నివాళిగా 'మహానటి'ని తెరకెక్కించాడని సినీ ప్రముఖులు కొనియాడారు. అంతటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ మళ్లీ పత్తా లేకుండా పోయాడు. అయితే ఇన్నాళ్లకు ఆయనలో కదలికి వచ్చిందని, త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కబోతోందని సమాచారం.
చిరంజీవి కోసం అశ్విన్ ఓ కథ తయారు చేస్తున్నాడని అప్పట్లో చెప్పారు. అయితే ఆ మాట ప్రకటనల వరకే పరిమితమైంది. చిరంజీవితో సినిమా అనే ఆలోచన పక్కన పెట్టి తన స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడనీ.. ఇప్పుడు ఆ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది.
నాగ అశ్విన్ ఓ కథని రెడీ చేసేశాడు.. నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ వంటి వారిలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేసే అవకాశాలున్నాయని వినికిడి. ఏప్రిల్ గానీ మే నెలలో నాగ అశ్విన్ సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.