పాటలు లేకుండా...నాగార్జున నెక్ట్స్ చిత్రం
హైదరాబాద్: నాగార్జున తదుపరి చిత్రంలో పాటలు ఉండబోవని సమాచారం. స్వామి రారా చిత్రంతో పరిచయమైన సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. రెగ్యులర్ రొటీన్ సినిమాల కన్నా విభిన్నమైన క్రియేటివ్ చిత్రం చేయాలని నాగార్జున చేయాలని ప్లాన్ చేసి,ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున చేయనున్నారు.
ఇక అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'మనం'. ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేం విక్రమ్కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం అనుకున్నదానికంటే సినిమా అద్భుతంగా వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

'వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో కుటుంబం మొత్తం కలసి నటించడం ఇప్పటివరకు రాజ్కపూర్ కుటుంబానికే దక్కింది. 'మనం' చిత్రం ద్వారా మాకు ఆ అవకాశం వచ్చింది. ఇందులో అఖిల్ కూడా నటిస్తే బాగుణ్ను అని అందరూ అంటున్నారు. అఖిల్ని మొదట హీరోగా చూసి.. తర్వాత మల్టీస్టారర్, కుటుంబ చిత్రాలు చేయాలన్నదే నా ఆలోచన..అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'మనం' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అఖిల్ చేస్తాడన్న రూమర్స్ ని ఇలా ఖండించారు నాగార్జున.


Click it and Unblock the Notifications











