Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తాతయ్య పాటకి మనవడు నాగచైతన్య స్టెప్స్
గోల్డెన్ డేస్ నాటి ఓల్డ్ పాట...నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది..(ప్రేమాభిషేకం) గుర్తుండే ఉంటుంది. ఈ పాట ఇప్పుడు నాగచైతన్య తాజా చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ పాటని తమన్నా, నాగచైతన్య డాన్స్ చేస్తారు. ఈ విషయమై నాగచైతన్య చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఈ చిత్రం ద్వారా ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల గానం చేసిన ఈ పాట మళ్ళి మనం వినబోతున్నాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి హీరో నాగచైతన్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అతను మాట్లాడుతూ...నేను గీతా ఆర్ట్స్ లో చేయటం ఆనందంగా ఉంది. చాలా మంది మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. అలాగే సుకుమార్ డెడికేటెడ్ డైరక్టర్. అయితే ఆ విషయం స్క్రిప్టు నేరేట్ చేస్తున్నప్పుడు అనుభవంలోకి వచ్చింది. నా మూడో చిత్రాన్ని ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాను. అయితే ఈ స్క్రిప్టు విన్నాక ఆ నిర్ణయం మార్చుకున్నాను. ప్రతీ ఒక్కరికీ నచ్చే ఎలమెంట్ ఈ స్క్రిప్టులో ఉంది అంటున్నారు. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్.