Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగచైతన్య ‘గౌరవం’నిలబడింది
అప్పటికే వరస ప్లాపులతో ఉన్న నాగ చైతన్య మరో నాలుగైదు కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు చేసి కెరీర్ గాడిలో పడ్డ తర్వాత 'గౌరవం' సినిమాలో నటించాలని నిర్ణయించుకుని రిజెక్టు చేసారు. రాధా మోహన్ చెప్పిన 'గౌరవం' కథ విని కేవలం సినిమా క్లాస్ పీపుల్ మాత్రమే చూసే సినిమా కావడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చక పోవచ్చని,అందుకే రిజెక్టు చేసినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య జడ్జిమెంట్ కరెక్టు అంటున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య, సునీల్ హీరోలుగా మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. సమర్పణలో 'తడాఖా' చిత్రం రూపొందుతోంది. శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లంకొండ గణేశ్బాబు మాట్లాడుతూ ' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ నెల 24న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నాం. మే లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.
తమన్నా, ఆండ్రియా కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో అశుతోష్ రాణా, నాగబాబు, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, రమాప్రభ, జయప్రకాష్రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి కథ: లింగుస్వామి, మాటలు: వేమారెడ్డి, స్క్రీన్ప్లే: దీనక్రాజ్, సంగీతం: థమన్, ఫొటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మైనేని ప్రసాద్, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కిశోర్ పార్థాసాని (డాలి).