Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగచైతన్య ఔట్.. అల్లు శిరీష్ ఇన్?
అక్కినేని యువ హీరో నాగచైతన్య కోలీవుడ్ డైరెక్టర్ రాధా మోహన్ దర్శకత్వంలో 'గౌరవం' అనే చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించి విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి నాగ చైతన్య తప్పుకున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం రాధా మోహన్ 'గౌరవం' చిత్రం గురించి అఫీషియల్ ప్రకటన చేశారు. ఈ చిత్రంలో నాగచైతన్య, శరత్ కుమార్ తనయ వరలక్ష్మి నటిస్తారని చెప్పారు. కానీ పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తలను బట్టి కొన్ని కారణాల వల్ల నాగచైతన్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, నాగచైతన్య స్థానంలో బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ ఎంపికైనట్లు సమాచారం.
'గౌరవం' చిత్రాన్ని డ్యూయెట్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. మే 16న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. 'అభియుమ్ నానుమ్' అనే తమిళ చిత్రానికి పని చేసి సినిమాటోగ్రాఫర్ ప్రీత ఈచిత్రానికి పని చేస్తున్నారు.
ప్రస్తుతం నాగ చైతన్య దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటో నగర్ సూర్య' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్, మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్, అచ్చిరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎడిటింగ్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నారోజ్