Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగచైతన్య, తమన్నా బావా మరదళ్ళుగా
నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న నూతన చిత్రం మే 19 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య, తమన్నా బావా, మరదళ్ళుగా కనిపించనున్నారు. అచ్చ తెలుగు వాతావరణంలో ఈ కథనం నడవబోతున్నదని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తమన్నా ని పెయిర్ గా అనుకున్నారు .కానీ వరుణ్ సందేశ్ వరస ప్లాప్ లతో మునిగితేలుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సుకుమార్, బన్నీ కాంబినేషన్లో ఆర్య 2 వచ్చింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో నాగచైతన్య క్యారెక్టైరేజన్ విభిన్నంగా ఉంటుందని, ఓ పంక్షన్ నిమిత్తం అమ్మమ్మ, మేనమామల ఇంటికి వచ్చిన అతనికి అక్కడ జరిగే సందడి ఏమిటి అన్నది కథనంగా నడుస్తుందంటున్నారు. ఇక తమన్నా తండ్రిగా, హీరో మేనమామగా నాజర్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని వినపడుతోంది. ఇక తాను ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తమన్నా కూడా కన్ఫర్మ్ చేసింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..అల్లు అర్జున్ తో 'బద్రీనాథ్', నాగచైతన్యతో ఓ సినిమా, ధనుష్ పక్కన ఓ తమిళ చిత్రం, 'విక్రమార్కుడు' తమిళ రీమేక్..సినిమాలు చేయబోతున్నాను అంది. మరో ప్రక్క సిద్దార్ధ కూడా పల్లె వాతావరణంలో బావ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.