నాగచైతన్య తో తమన్నా మరోసారి... ఏ సినిమానో తెలుసా ?
ప్రేమమ్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'సవ్యసాచి' . కొత్త హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.
అక్కినేని నాగార్జున కెరీర్లో మంచి హిట్ సినిమాగా నిలిచిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసి పాటను సవ్యసాచి సినిమాలో రీమిక్స్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ, నాగార్జున నర్తించిన ఈ పాట అప్పట్లో హిట్ సాంగ్ గా నిలిచింది. సవ్యసాచి సినిమాలో ఈ పాటను ఒక సందర్భంలో పెట్టబోతున్నట్లు సమాచారం.

జూన్ రెండోవారంలో చిత్రీకరించబోయే ఈ సాంగ్ లో తమన్నా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ తమన్నా గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమన్నా, నాగ చైతన్య జంటగా 100% లవ్ సినిమాలో నటించడం జరిగింది.


Click it and Unblock the Notifications











