Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగచైతన్య తో తమన్నా మరోసారి... ఏ సినిమానో తెలుసా ?
ప్రేమమ్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'సవ్యసాచి' . కొత్త హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.
అక్కినేని నాగార్జున కెరీర్లో మంచి హిట్ సినిమాగా నిలిచిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసి పాటను సవ్యసాచి సినిమాలో రీమిక్స్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ, నాగార్జున నర్తించిన ఈ పాట అప్పట్లో హిట్ సాంగ్ గా నిలిచింది. సవ్యసాచి సినిమాలో ఈ పాటను ఒక సందర్భంలో పెట్టబోతున్నట్లు సమాచారం.
జూన్ రెండోవారంలో చిత్రీకరించబోయే ఈ సాంగ్ లో తమన్నా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ తమన్నా గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమన్నా, నాగ చైతన్య జంటగా 100% లవ్ సినిమాలో నటించడం జరిగింది.