Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగచైతన్య తో తమన్నా మరోసారి... ఏ సినిమానో తెలుసా ?
ప్రేమమ్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత కథానాయకుడు నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'సవ్యసాచి' . కొత్త హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.
అక్కినేని నాగార్జున కెరీర్లో మంచి హిట్ సినిమాగా నిలిచిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసి పాటను సవ్యసాచి సినిమాలో రీమిక్స్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ, నాగార్జున నర్తించిన ఈ పాట అప్పట్లో హిట్ సాంగ్ గా నిలిచింది. సవ్యసాచి సినిమాలో ఈ పాటను ఒక సందర్భంలో పెట్టబోతున్నట్లు సమాచారం.
జూన్ రెండోవారంలో చిత్రీకరించబోయే ఈ సాంగ్ లో తమన్నా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ తమన్నా గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవ కుశ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమన్నా, నాగ చైతన్య జంటగా 100% లవ్ సినిమాలో నటించడం జరిగింది.