Don't Miss!
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నాగశౌర్య కొత్త సినిమాకు క్లాసిక్ టైటిల్ ఫిక్స్!
ఇటీవలే ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిఫెరెంట్ కథాంశాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నా యంగ్ హీరో నాగశౌర్య. తాజాగా ఆయన మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని అఫీషియల్గా ప్రకటించేశారు కూడా. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం ఓ క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా రూపొంది సూపర్ డూపర్ హిట్ సాధించిన 'మూగ మనసులు' పేరు ఫైనల్ చేయబోతున్నారట. ఈ మేరకు ఇప్పటికే దర్శకనిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చేశారని టాక్. అయితే ఈ సినిమా కోసం ఇతర సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసి, ఆ తర్వాత ఈ టైటిల్ అఫీషియల్గా ప్రకటించాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారి 8వ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ద్వారా 'లక్ష్మీ సౌజన్య' అనే మహిళా దర్శకురాలిగా పరిచయమవుతోంది. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం .. సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఆ వివరాలను ప్రకటించనున్నారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది.