Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నాగశౌర్య కొత్త సినిమాకు క్లాసిక్ టైటిల్ ఫిక్స్!
ఇటీవలే ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిఫెరెంట్ కథాంశాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నా యంగ్ హీరో నాగశౌర్య. తాజాగా ఆయన మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని అఫీషియల్గా ప్రకటించేశారు కూడా. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం ఓ క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా రూపొంది సూపర్ డూపర్ హిట్ సాధించిన 'మూగ మనసులు' పేరు ఫైనల్ చేయబోతున్నారట. ఈ మేరకు ఇప్పటికే దర్శకనిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చేశారని టాక్. అయితే ఈ సినిమా కోసం ఇతర సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసి, ఆ తర్వాత ఈ టైటిల్ అఫీషియల్గా ప్రకటించాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారి 8వ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ద్వారా 'లక్ష్మీ సౌజన్య' అనే మహిళా దర్శకురాలిగా పరిచయమవుతోంది. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం .. సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఆ వివరాలను ప్రకటించనున్నారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది.