Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘దిక్కులు చూడకు రామయ్య’ కథ ఇదా... షాక్?
హైదరాబాద్ : నాగశౌర్య, సనా మక్బూల్, అజయ్, ఇంద్రజ ముఖ్యపాత్రల్లో త్రికోటి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య'.ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు ఈ సినిమా ‘యు/ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న మ్యాటర్ మీరు ఇప్పుడు చదవబోతోంది. ఈ కథ గురించి విన్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కాన్సెప్టు తో సినిమా రావటం అనేది ఊహించలేం అంటున్నారు.
ఈ చిత్రంలో అజయ్ కి చిన్న వయస్సులోనే ఇంద్రజతో వివాహం అవుతుంది. అయితే ఆమె ఓ కొడుకుని కన్న తర్వాత మరణిస్తుంది. ఈ నేపధ్యంలో అతను పూల రంగడులా తిరుగుతూంటాడు. అలాగే తనకన్నా తక్కువ వయస్సు ఉన్న ఓ అమ్మాయి వెనక పడుతూంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అజయ్ ఎదిగిన కొడుకు నాగ శౌర్య కూడా అదే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటారు. అయితే ఈ విషయం అజయ్ కి తెలిసి ఏం చేసాడు అనేది క్లైమాక్స్ అని చెప్తున్నారు. అయితే ఈ కథలో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకూ ఆగాల్సిందే.
నిర్మాత మాట్లాడుతూ... ''వినోదాత్మక ప్రేమకథ ఇది. త్రికోఠి చెప్పిన కథ కొత్తగా ఉంది. మా సంస్థ నుంచి వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా నిలుస్తుంది'' అన్నారు. ఈగ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా, అందాల రాక్షసి చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఈ చిత్రం నిర్మాత కావటంతో ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఇదే బ్యానర్ నుంచి విడుదలైన బాలకృష్ణ లెజండ్ చిత్రం ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ చిత్రం ప్రారంభించారు. ఈ చిత్రంలోనూ అన్ని కమర్షియల్ విలువలూ ఉన్నాయని చెప్తున్నారు.
నాగినీడు, అలీ, విశాల్, రమేష్, హరితేజ, వేణు తదితరులు నటిస్తున్నారు. అజయ్, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాటలు: రమేష్ - గోపి, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: బి.వి.అమరనాథ్రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సంగీతం: కీరవాణి.