Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హీరో నాగార్జున పేషెంటా?
హైదరాబాద్: ప్రముఖ నటుడు నాగార్జున పేషెంటుగా ఓ నటించబోతున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున మరియు తమిళ స్టార్ కార్తీల కాంబినేషన్లో డైరెక్టర్ వంశీ పైడిల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున పేషెంటు పాత్రలో, కార్తి నర్స్ పాత్రలో నటిస్తారట.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఈ ఇద్దరు హీరోలు ఒకే హీరోయిన్తో రొమాన్స్ చేయబోతున్నారట. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. ఈ చిత్రాన్ని పి.వి.పి సినిమా తమ అత్యుత్తమ నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. అక్కినేని నాగార్జునకు తెలుగుతో పాటు తమిళ చిత్ర సీమలో కూడా మంచి ఇమేజ్ ఉంది. అలాగే కార్తీ ఇటీవలే ‘మద్రాస్' చిత్రంతో తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
కార్తికి తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ద్వారా తెలుగు-తమిళ ఇండస్ట్రీలను ఏకం చేసే అద్భుత అవకాశాన్ని పి.వి.పి సొంతం చేసుకోవడం విశేషం. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పివిపి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు తొలుత జూ ఎన్టీఆర్-నాగార్జున కాంబినేషన్లో అనుకున్నారు. అయితే కథ, స్క్రిప్టు పరమైన అంశాలతో విబేధించిన జూ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. దీంతో ఎన్టీఆర్ స్థానంలో కార్తిని తీసుకున్నారు.