Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భయపడ్డ నాగార్జున...పూర్తి జాగ్రత్తలు
హైదరాబాద్ :నాగార్జున ఎన్నడూ లేనిది తన కెరీర్ లో తొలి సారిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. తాను నమ్మి చేసిన గ్రీకు వీరుడు,భాయ్ చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్స్ గా నమోదు కావటంతో ఆయన తదుపరి చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. దాంతో ఆయన దర్శకుడు సీనియారిటి కన్నా కథ, దాన్ని చెప్పే విధానం,చెప్పినట్లు తీసి పెట్టగలడా లేదా అన్నది చూసుకునే దిగదలుచుకున్నారు. అవతలి వారు ఎంత పెద్ద డైరక్టర్ అయినా ఇదే థీరిని ఆయన ఫాలో అయ్యి మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఏ కథకీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు.
అలాగే నాగార్జున తదుపరి చిత్రంలో పాటలు ఉండబోవని సమాచారం. స్వామి రారా చిత్రంతో పరిచయమైన సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. రెగ్యులర్ రొటీన్ సినిమాల కన్నా విభిన్నమైన క్రియేటివ్ చిత్రం చేయాలని నాగార్జున చేయాలని ప్లాన్ చేసి,ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున చేయనున్నారు.
ఇక అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'మనం'. ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేం విక్రమ్కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం అనుకున్నదానికంటే సినిమా అద్భుతంగా వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హర్షవర్దన్ కథ, సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్గా నిలువనున్నాయని తెలుస్తోంది. నాగార్జునకు జోడీగా శ్రీయ నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సర సన సమంత నటిస్తున్నారు. అనూప్రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం.