Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సోదరి బ్యానర్ లో నాగార్జున నెక్ట్స్ చిత్రం
శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించే చిత్రంలో నటించడానికి నాగార్జున అంగీకరించినట్లు సమాచారం. కథ మొత్తం పూర్తయిన ఈ చిత్రం దిల్రాజు సినిమా పూర్తి కాగానే సెట్స్పైకి వెళ్లనుంది. అయితే దర్శకుడు ఎంపిక కావలిసి ఉంది. ఇంతకు ముందు ఈ బ్యానర్పై నాగసుశీల తనయుడు సుశాంత్ హీరోగా 'కాళిదాస్", 'కరెంట్" చిత్రాలు నిర్మించారు. ఆ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫ్లాపుని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక మొన్న శుక్రవారం రిలీజైన 'కేడి" చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నాగార్జన 'దిల్"రాజు, ప్రకాశ్రాజ్ నిర్మాతలుగా 'ఆకాశమంత"ఫేం రాధామోహన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. తెలుగు, తమిళంలో రూపొందే ఈ చిత్రానికి తమిళంలో 'పయనం" టైటిల్ ఖరారు చేయగా, తెలుగుకి 'వాంటెడ్" టైటిల్ని పరిశీలిస్తున్నారు. హైజాక్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ పిబ్రవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.