twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోదరి బ్యానర్ లో నాగార్జున నెక్ట్స్ చిత్రం

    By Srikanya
    |

    శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించే చిత్రంలో నటించడానికి నాగార్జున అంగీకరించినట్లు సమాచారం. కథ మొత్తం పూర్తయిన ఈ చిత్రం దిల్‌రాజు సినిమా పూర్తి కాగానే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే దర్శకుడు ఎంపిక కావలిసి ఉంది. ఇంతకు ముందు ఈ బ్యానర్‌పై నాగసుశీల తనయుడు సుశాంత్ హీరోగా 'కాళిదాస్", 'కరెంట్" చిత్రాలు నిర్మించారు. ఆ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫ్లాపుని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక మొన్న శుక్రవారం రిలీజైన 'కేడి" చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నాగార్జన 'దిల్"రాజు, ప్రకాశ్‌రాజ్ నిర్మాతలుగా 'ఆకాశమంత"ఫేం రాధామోహన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. తెలుగు, తమిళంలో రూపొందే ఈ చిత్రానికి తమిళంలో 'పయనం" టైటిల్ ఖరారు చేయగా, తెలుగుకి 'వాంటెడ్" టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. హైజాక్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ పిబ్రవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X