నాగ్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో

మరో ప్రక్క గుణ్ణం గంగరాజు..చెక్ దే ఇండియా సినిమా స్పూర్తితో నాగార్జునకి ఓ కథ వండుతున్నారు.అయితే నాగార్జున మాత్ర తన కుమారుడు హీరోగా నిర్మితమవుతున్న జోష్ చిత్రం రిలీజ్ తర్వాతే తన సినిమా అంటున్నారు. జూలై లో జోష్ చిత్రం విడుదలవుతుందనీ, అనంతరమే నాగార్జున మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటారనీ చెబుతున్నారు. నాగార్జునకు సక్సెస్ సెంటిమెంట్ పరంగా డిసెంబర్ రిలీజ్ ను టార్గెట్ చేసుకుని నాగార్జున-పరశురామ్ కాంబినేషన్ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు శివప్రసాద్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం పరుశరామ్ ..రవితేజ,నయనతార కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనికి హాస్యనటుడు గణేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదీ సంగతి. ఏదైమైనా పరుశరామ్ త్వరలోనే టాప్ డైరక్టర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











