Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హాట్ న్యూస్ : 'డమరుకం' విడుదల వాయిదా
హైదరాబాద్: నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం'. వచ్చే వారం విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల మొదట అనుకున్న తేదీ కాకుండా వాయిదా పడినట్లు విశ్వసనీయ సమాచారం. గ్రాఫిక్స్ వర్క్ డిలే కావటంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 19 న కానీ, అక్డోబర్ 24న గానీ విడుదల చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో పూర్తి ఖరారు విడుదల తేదీతో ప్రకటన అధికారికంగా వచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు.
తన కెరీర్లోనే మొదటిసారి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం' అని హీరో నాగార్జున అన్నారు. నాగార్జున, అనుష్క జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డా.వెంకట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 'నిర్మాత ఎక్కడా రాజీపడకుండా చాలా భారీగా ఈ చిత్రాన్ని తీశారు. దర్శకుడు కూడా నా అంచనాలకు మించి చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. గ్రాఫిక్స్కు అత్యంత ప్రాధాన్యం ఉన్న కథాంశమిది. తప్పకుండా చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు.