Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగార్జున రాజమండ్రిలోనే....
హైదరాబాద్: నాగార్జున ఇక కొద్ది రోజులు పాటు కంటిన్యూగా రాజమండ్రిలో కనిపించనున్నట్లు సమాచారం. అక్కడ ఆయన హీరోగా రూపొందుతున్న సోగ్గాడే చిన్ని నాయిన షూటింగ్ అక్కడ కంటిన్యూ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. రాజమండ్రి, ఆ చుట్టు ప్రక్కల జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్ర తాత, మరొకటి మనవడుగా ఆయన కనిపించి అలరించనున్నారు. తాత పాత్రకు జోడీగా రమ్య కృష్ణ, మనవడు పాత్రకు జోడీగా సోనాలి చౌహాన్ కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
ఉయ్యాల జంపాల నిర్మాత రామ్మోహరావు రూపొందిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మాణం కానుంది. కళ్యాణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇందుకోసం రీసెంట్ గా ఫొటో షూట్ జరిగిందని తెలుస్తోంది. ఆయన తాతగా ఎలా కనిపించబోతున్నాడనేది ఆయన అభిమానుల్లో హాట్ టాపిక్ గా ఆసక్తికరమైన అంశంగా మారింది.
అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం జరుగుతుంది. రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం నాగార్జున తన కుమారుడు నాగా చైతన్య తాజా చిత్రం రిలీజ్ ని పర్యవేక్షిస్తున్నారు.
'ఒక లైలా కోసం' గురించి నాగ్ మాట్లాడుతూ...ఆ చిత్రం ఇప్పటికే చూశా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. మంచి సమయం తీసుకొని విడుదల చేస్తాం. ఈ రోజుల్లో మంచి సినిమా తీయడమే కాదు. సరైన సమయంలో విడుదల చేయడం కూడా ముఖ్యమే. 'మనం'కోసం రెండు నెలలు ఆగాం. మంచి సినిమా తీశాం. విడుదల విషయంలో కాస్త ఆలస్యమైనా ఫర్లేదు అన్నారు.