Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున రాజమండ్రిలోనే....
హైదరాబాద్: నాగార్జున ఇక కొద్ది రోజులు పాటు కంటిన్యూగా రాజమండ్రిలో కనిపించనున్నట్లు సమాచారం. అక్కడ ఆయన హీరోగా రూపొందుతున్న సోగ్గాడే చిన్ని నాయిన షూటింగ్ అక్కడ కంటిన్యూ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. రాజమండ్రి, ఆ చుట్టు ప్రక్కల జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్ర తాత, మరొకటి మనవడుగా ఆయన కనిపించి అలరించనున్నారు. తాత పాత్రకు జోడీగా రమ్య కృష్ణ, మనవడు పాత్రకు జోడీగా సోనాలి చౌహాన్ కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
ఉయ్యాల జంపాల నిర్మాత రామ్మోహరావు రూపొందిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మాణం కానుంది. కళ్యాణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇందుకోసం రీసెంట్ గా ఫొటో షూట్ జరిగిందని తెలుస్తోంది. ఆయన తాతగా ఎలా కనిపించబోతున్నాడనేది ఆయన అభిమానుల్లో హాట్ టాపిక్ గా ఆసక్తికరమైన అంశంగా మారింది.
అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం జరుగుతుంది. రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం నాగార్జున తన కుమారుడు నాగా చైతన్య తాజా చిత్రం రిలీజ్ ని పర్యవేక్షిస్తున్నారు.
'ఒక లైలా కోసం' గురించి నాగ్ మాట్లాడుతూ...ఆ చిత్రం ఇప్పటికే చూశా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. మంచి సమయం తీసుకొని విడుదల చేస్తాం. ఈ రోజుల్లో మంచి సినిమా తీయడమే కాదు. సరైన సమయంలో విడుదల చేయడం కూడా ముఖ్యమే. 'మనం'కోసం రెండు నెలలు ఆగాం. మంచి సినిమా తీశాం. విడుదల విషయంలో కాస్త ఆలస్యమైనా ఫర్లేదు అన్నారు.