Don't Miss!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- News ఘోర కారు ప్రమాదం: ట్యాంకర్ను ఢీకొట్టడంతో చిన్నారి సహా 10 మంది మృతి
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
నాగార్జున నిర్ణయం వెనుక ఆంతర్యమేంటో! చిరంజీవి, ప్రభాస్తో పెట్టుకోవడం ఎందుకనే ఇలా చేస్తున్నారా..?
Recommended Video
సీనియర్ హీరో నాగార్జున ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఆ నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరచడమే గాక పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్లతో పోటీకి దిగడం ఎందుకని నాగార్జునకు ఓ ఆలోచన వచ్చిందట. కానీ ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో అని నాగార్జున అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'మన్మథుడు 2'. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో నాగార్జునతో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేస్తోంది.
విడుదల విషయంలో మెలిక
ఈ చిత్ర లొకేషన్స్లో రకుల్, నాగార్జున కలిసి దిగిన పిక్స్ చూసి మురిసిపోయారు అక్కినేని అభిమానులు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న తరుణంలో ఈ సినిమా విడుదల విషయమై ఓ మెలిక పడింది. మొదట మన్మథుడు 2 చిత్రాన్ని ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుంచాలని ఫిక్స్ అయ్యారు నాగార్జున. అయితే అదే నెలలో మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ 'సైరా నరసింహా రెడ్డి' విడుదల కానుండటంతో.. తన సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేశారట.
దసరా రేస్లో ఉండటం మంచిది కాదని
కానీ దసరాకు ప్రభాస్ బిగ్గెస్ట్ మూవీ 'సాహో' వస్తుండటం, బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కూడా అదే సీజన్ లో విడుదల కానుండటంతో దసరా రేస్లో ఉండటం మంచిది కాదని నాగ్ భావిస్తున్నారట. ఈ మేరకు తన చిత్రాన్ని అనుకున్న దానికంటే ముందుగానే అంటే జులై నెలలోనే విడుదల చేయాలని నాగ్ నిర్ణయించుకున్నారట.
అభిమానుల్లో కొత్త టెన్షన్
అయితే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ డేట్ ముందుకు జరపడం స్వాగతిస్తున్న అక్కినేని అభిమానులకు ఓ కొత్త టెన్షన్ పట్టుకుందట. ఇంకా రెండు నెలలే సమయం ఉంది కాబట్టి ఈ లోగా సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుందా? ఒకవేళ అయినా కూడా ఆదరాబాదరాగా చేయడం కారణంగా ఫైనల్ అవుట్ ఫుట్లో ఏమైనా తేడా కొడుతుందేమోనని అనుమానాలు మొదలయ్యాయట.
రాహుల్ రవీంద్రన్ చేతుల్లోనే...
తన మొదటి సినిమా 'చిలసౌ'ని కేవలం నెల రోజుల్లోనే పూర్తిచేసిన ఘనత డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్కి ఉంది. నాగ్ నిర్ణయం మేరకు మరి ఈ సినిమాకు అలాగే కానిస్తాడా? లేదా? అనేది చూడాలి మరి.