Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అంటే నాగార్జున హ్యాండ్ ఇచ్చినట్లేనా?
హైదరాబాద్ : ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన దర్శకుడు అవసరాల శ్రీనివాస్. ఆయన తదుపరి చిత్రం నాగార్జున తో చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిందనే వార్తలు వినపడుతున్నాయి. నాగార్జున మరో కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిత్రం కమిటయినట్లు చెప్పుకుంటున్నారు.
అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సోగ్గాడు అనే టైటిల్ ని సైతం ఖరారు చేసినట్లు వినపడుతోంది. ఈ మేరకు సోగ్గాడు టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినం చేయనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం జరుగుతుంది. రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం నాగార్జున తన కుమారుడు నాగా చైతన్య తాజా చిత్రం రిలీజ్ ని పర్యవేక్షిస్తున్నారు.
'ఒక లైలా కోసం' గురించి నాగ్ మాట్లాడుతూ...ఆ చిత్రం ఇప్పటికే చూశా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. మంచి సమయం తీసుకొని విడుదల చేస్తాం. ఈ రోజుల్లో మంచి సినిమా తీయడమే కాదు. సరైన సమయంలో విడుదల చేయడం కూడా ముఖ్యమే. 'మనం'కోసం రెండు నెలలు ఆగాం. మంచి సినిమా తీశాం. విడుదల విషయంలో కాస్త ఆలస్యమైనా ఫర్లేదు అన్నారు.