Don't Miss!
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- News నీ భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది, ఫ్రెండ్స్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్తకు ఆఫర్ !
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
మళ్లీ ఎన్టీఆర్గా బాలకృష్ణ.. ఓ సెన్సేషనల్ మూవీకి గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ హిట్టు, ఫ్లాఫ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందించే రూలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. రూలర్ మూవీతో అంచనాలు పెంచేసి అభిమానుల్లో ఉత్తేజాన్ని బాలయ్య నింపాడు. ఇలా ఫ్యాన్స్ను ఆనందంలో ముంచెత్తుతున్న బాలకృష్ణ మరో సంతోషకరమైన వార్తను అందించనున్నారనే విషయం సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఆ వార్త ఏమిటంటే..
ఎన్టీఆర్ బయోపిక్లో
తన తండ్రి జీవిత కథ ఎన్టీఆర్ బయోపిక్తో చేసిన ప్రయత్నం బాలయ్యకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అటు బాక్సాఫీస్ వద్ద జోష్ పెంచగా పోగా, నందమూరి అభిమానులను సైతం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఎన్టీఆర్గా బాలయ్య అద్భుతంగా నటించడమే కాకుండా గెటజ్ రూపంలో ఆకట్టుకొన్నాడని సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. తాజాగా మరోసారి బాలయ్య ఎన్టీఆర్గా అవతారం ఎత్తబోతున్నారనే వార్త ఫిలింనగర్లో వైరల్ అయింది.
తలైవి చిత్రంలో
తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి, అలనాటి అందాల తార జే జయలలిత జీవితం ఆధారంగా తలైవి అనే సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో జయలలితగా కంగన రనౌత్ కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ఏల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జయలలితతో కలిసి ఎన్టీఆర్ నటించిన సినిమాల సన్నివేశాల్లో నటించాలని బాలయ్యతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
బాలకృష్ణ సానుకూలంగా
తలైవా చిత్ర యూనిట్ తెచ్చిన ప్రపోజల్పై బాలకృష్ణ కూడా సానుకూలంగా స్పందించారట. తన తండ్రి పాత్రలో నటించే అవకాశం కంటే జీవితంలో మరో గొప్ప ఏముంటుందనే అభిప్రాయాన్ని బాలయ్య వ్యక్తం చేశారట. అయితే ఇంకా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, త్వరలోనే పాత్ర తీరు తెన్నులను తెలుసుకొని నటించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో ఎంజీఆర్గా అరవింద స్వామి, కరుణానిధిగా ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారట.
బోయపాటి శ్రీను చిత్రంలో
ఇక రూలర్ సినిమాను ముగించుకొని తన 106వ సినిమా కోసం బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాలో యూత్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. అందుకోసం బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారట. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నట్టు సమాచారం.