Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణ తో టచ్ లో ఉంది..అందుకే వర్కవుట్ అయ్యింది
హైదరాబాద్ :సాధారణంగా హిట్ పెయిర్ అని పేరు పడకపోతే ఆ జంటను రిపీట్ చేయటానికి దర్శక,నిర్మాతలు ఆసక్తి చూపరు. కానీ ఇప్పుడు రాధికా ఆప్టే రెండో సారి బాలయ్య ప్రక్కన ఎంపికయ్యి వార్తల్లో నిలించింది. ఆమెను బాలకృష్ణ తాజా చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. చాలా మంది హీరోయిన్స్ ని వెతికి మళ్లీ ఆమె దగ్గరకే వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది.
బాలకృష్ణే స్వయంగా ఆమెను రికమెండ్ చేసారని చెప్పుకుంటున్నారు. లెజండ్ లో ఆమె నటనకు ఇంప్రెస్ అయిన బాలయ్య...ఆమెను తీసుకుందామని చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. లెజండ్ అనంతరం ఆమె..బాలయ్యతో టచ్ లోనే ఉండేదని దాంతో హీరోయిన్ అవసరం అనిపించగానే పిలిపించి తీసుకున్నారంటున్నారు.
'లెజెండ్'లో బాలకృష్ణతో ఆడిపాడి ప్రేక్షకులను అలరించిన అందం రాధికా ఆప్టే. అందులో పెద్ద బాలకృష్ణ మేనకోడలుగా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె మరోసారి బాలకృష్ణతో నటిస్తోంది. బాలకృష్ణ తాజా చిత్రంలో ఓ హీరోయిన్ గా రాధికా ఆప్టేను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష చేస్తోంది.
నిర్మాత మాట్లాడుతూ...''సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కూ సమ ప్రాధాన్యముంటుంది. 'లెజెండ్'లో రాధిక నటనను చూసి ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఆమెకు ఈ పాత్ర మంచి పేరు తీసుకొస్తుంది'' అన్నారు.
ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం.''అని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రుద్రపాటి రమణారావు నిర్మాత. ఇందులో బాలకృష్ణ సీబీఐ అధికారిగా కనిపిస్తారని సమాచారం. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: వెంకటప్రసాద్. కళ: రవీందర్.