Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య డైరెక్షన్లో ఆ క్లాసిక్కు సీక్వెల్.. రాత్రికి రాత్రే కథ
నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్లో ఎన్నో క్లాసిక్ చిత్రాలున్నాయి. వాటిలో ముఖ్యంగా భైరవ ద్వీపం, ఆదిత్య 369 అనే సినిమాలు ఎప్పటికీ నిలిచిపోయేవి. సంగీతం పరంగా ఎక్కడో నిలిచిన ఆ చిత్రాలు అప్పట్లో పెను సంచనలం సృష్టించాయి. బాలయ్య కూడా సందర్భాను సారంగా నాటి చిత్రాల గురించి ప్రస్తావిస్తుంటాడు.
సీక్వెల్ ప్రయత్నాలు..
ఆదిత్య 369ను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాస రావు కూడా ఈ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు ఆసక్తిని చూపించారు. టైమ్ మిషిన్ను ఆధారంగా చేసుకుని తీసిన ఈచిత్రం అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో సెన్సేషనే. అలాంటి క్లాసిక్కు సీక్వెల్ చేయాలని బాలయ్య కూడా సిద్దంగానే ఉన్నాడు.
టైటిల్ కూడా ఫిక్స్..
ఆదిత్య 999 అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సీక్వెల్కు సంబంధించి అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చినా అది ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం మాత్రం సీక్వెల్కు రంగం సిద్దం కాబోతోన్నట్లు తెలుస్తోంది.
రాత్రికి రాత్రే..
ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని బాలకృష్ణ చెప్పడం గమనార్హం. ఒక రోజు రాత్రికి రాత్రి ఆ సినిమాకు కథ తట్టిందని, ఆ సినిమా చాలా ప్రయోగాత్మకంగా ఉంటుందని అన్నాడు. ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నాడు.
బోయపాటి చిత్రం తరువాత..
రూలర్ అంటూ పలకరించిన బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీ కానున్నాడు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే.. సీక్వెల్కు సంబంధించిన పనులు చేప్టటే అవకాశాలున్నాయని తెలుస్తోంది.