Don't Miss!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలయ్య డైరెక్షన్లో ఆ క్లాసిక్కు సీక్వెల్.. రాత్రికి రాత్రే కథ
నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్లో ఎన్నో క్లాసిక్ చిత్రాలున్నాయి. వాటిలో ముఖ్యంగా భైరవ ద్వీపం, ఆదిత్య 369 అనే సినిమాలు ఎప్పటికీ నిలిచిపోయేవి. సంగీతం పరంగా ఎక్కడో నిలిచిన ఆ చిత్రాలు అప్పట్లో పెను సంచనలం సృష్టించాయి. బాలయ్య కూడా సందర్భాను సారంగా నాటి చిత్రాల గురించి ప్రస్తావిస్తుంటాడు.
సీక్వెల్ ప్రయత్నాలు..
ఆదిత్య 369ను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాస రావు కూడా ఈ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు ఆసక్తిని చూపించారు. టైమ్ మిషిన్ను ఆధారంగా చేసుకుని తీసిన ఈచిత్రం అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో సెన్సేషనే. అలాంటి క్లాసిక్కు సీక్వెల్ చేయాలని బాలయ్య కూడా సిద్దంగానే ఉన్నాడు.
టైటిల్ కూడా ఫిక్స్..
ఆదిత్య 999 అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సీక్వెల్కు సంబంధించి అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చినా అది ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం మాత్రం సీక్వెల్కు రంగం సిద్దం కాబోతోన్నట్లు తెలుస్తోంది.
రాత్రికి రాత్రే..
ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని బాలకృష్ణ చెప్పడం గమనార్హం. ఒక రోజు రాత్రికి రాత్రి ఆ సినిమాకు కథ తట్టిందని, ఆ సినిమా చాలా ప్రయోగాత్మకంగా ఉంటుందని అన్నాడు. ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నాడు.
బోయపాటి చిత్రం తరువాత..
రూలర్ అంటూ పలకరించిన బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీ కానున్నాడు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే.. సీక్వెల్కు సంబంధించిన పనులు చేప్టటే అవకాశాలున్నాయని తెలుస్తోంది.