Don't Miss!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నందమూరి బాలయ్యతో మరో ప్లాన్ వేసిన అల్లు అరవింద్.. కొడుకు కోసం అలా..
నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో పాటు మరొకవైపు ఆహా ఓటీపీ షో అన్ స్టాపబుల్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మొదటిసారి ఒక టాక్ షో ద్వారా హోస్ట్ గా మారిన బాలయ్య బాబు ఊహించిన విధంగా ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నాడు. బాలయ్య బాబు లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయే విధంగా చేస్తున్నాడు. అంతేకాకుండా బాలయ్య మిగతా హీరోలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని ఈ షో ద్వారా అర్థమవుతోంది.
మెగా హీరోలతో కూడా అతనికి ఎలాంటి క్లాష్ లేదు అనే విధంగా చేయాలి అని అల్లు అరవింద్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లు అరవింద్ కోరిక మేరకే బాలయ్య బాబు అన్ స్టాపబుల్ చేయడానికి ఒప్పుకున్నాడు. విరిమధ్య ఇప్పుడు ఈ షో ద్వారా మంచి సాన్నిహిత్యం కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ షోలోకి మెగా ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు అర్జున్ మాత్రమే వచ్చాడు. ఇక మిగతా మెగా హీరోలు కూడా వస్తే షోకు మంచి హైప్ రావడమే కాకుండా మెగా నందమూరి హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనే విషయాన్ని కూడా చెప్పవచ్చు అని అల్లు అరవింద్ ఆలోచిస్తున్నారు.
అంతేకాకుండా అల్లు నిర్మాత మరొక పెద్ద ప్లాన్ కూడా వేసినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు మరింత క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ రూట్ లోనే తన కొడుకు సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా అల్లు అరవింద్ బాలయ్య బాబును ఉపయోగించకబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు.
ఇక నవంబర్ 4వ తేదీన అతని నుంచి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణను ముఖ్యఅతిథిగా రప్పించాలి అని అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈసారి నందమూరి ఫ్యాన్స్ ఫోకస్ కూడా అల్లు శిరీష్ పై పడేవిధంగా ప్లాన్ చేసినట్లు టాక్. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.