Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెండుగా చీలిన నందమూరి ఫ్యాన్స్
నందమూరి ఫ్యాన్స్ అంటే సాధారణంగా ఆ కుటుంబానికి చెందిన హీరోలందరినీ అభిమానిస్తుంటారు. నందమూరి వంశంలో ఏ హీరో సినిమా హిట్టయినా సంబర పడిపోతారు. అయితే ఇప్పడు ఈ అభిమానులు ఇప్పడు రెండుగా చీలి పోయారు. ఓ వర్గం బాలయ్య వైపు నిలిస్తే, మరో వర్గం జూ.ఎన్టీఆర్ కు సపోర్టుగా పని చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తీరు నచ్చడం లేదని బాలయ్య అభిమానులు ఆయన్ను పక్కన పెడితే, అబ్బాయ్ ఎదుగుదలకు సహకరించడం లేదని జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యను వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ జూనియర్ పై కోపంగా ఉన్నారు. అక్టోబర్ 6న 'శ్రీరామ రాజ్యం" సినిమా విడులవుతోందని తెలిసినా, అదేనెలలో రెండు వారాల గ్యాప్తో జూనియర్ తన 'ఉసరవెల్లి"ని విడుదల చేస్తుండటమే ఇందుకు కారణం. ఇలా అయితే ఇద్దరి సినిమాలకు నష్టం వాటిల్లుతుందనేది వారి ఆందోళన. ఈ విషయంలో బాబాయ్, అబ్బాయ్ పునరాలోచించుకోవాలని సూచిస్తూనే, జూనియర్ తన సినిమా విడుదలను మరికొన్ని రోజులు వాయిదా వేస్తే మంచిదని వాదిస్తున్నారు.