Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను ఆరంభించి ఎన్నో చిత్రాలకు పని చేసిన అతడు.. రవితేజ - మీరా జాస్మిన్ కాంబినేషన్లో వచ్చిన 'భద్ర'తో దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆ వెంటనే 'తులసి', 'సింహా' వంటి భారీ విజయాలను దక్కించుకుని హ్యాట్రిక్ సాధించాడు. ఇక, ఎన్టీఆర్తో చేసిన 'దమ్ము' డిజాస్టర్గా మిగిలింది. అయితే, ఆ తర్వాత 'లెజెండ్', 'సరైనోడు'తో భారీ హిట్లను అందుకున్నాడు. ఇక, 'వినయ విధేయ రామ' వంటి హ్యూజ్ ఫ్లాప్ తర్వాత బాలయ్యతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నాడు.
రెండు భారీ విజయాల తర్వాత బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న చిత్రమే 'అఖండ'. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తవగా.. ప్రస్తుతం వికారాబాద్ అటవీ ప్రాంతంలో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. ఇక, ఇందులో బాలయ్య అఘోరాగానూ, ఓ ఊరి పెద్దగానూ నటిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్, సామ్నా కాసీం హీరోయిన్లు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మే 28న విడుదల కాబోతుంది.
'అఖండ' పట్టాలపై ఉండగానే బోయపాటి తన తదుపరి సినిమాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నందమూరి హీరో కల్యాణ్ రామ్తో చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అతడి బాడీ లాంగ్వేజ్కు సరిపోయే ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీని సిద్ధం చేసిన బోయపాటి.. ఇటీవలే దానిని కల్యాణ్కు వినిపించాడని తెలుస్తోంది. దీనికి వెంటనే అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.