Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'అలా మొదలైంది' దర్శకురాలి నెక్ట్స్ కుర్ర హీరోతో
హైదరాబాద్ : రొమాంటిక్ కామెడీ చిత్రం 'అలా మొదలైంది' ఎంత హిట్టైందో తెలిసిందే. అయితే ఆ తర్వాత వచ్చిన 'జబర్ధస్త్' చిత్రం తేడా కొట్టేసింది. దాంతో చాలా గ్యాప్ వచ్చిసింది. ఇన్నాళ్లకి ఆమె మరో చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటోంది. 'అలా మొదలైంది' నిర్మాత దామోదర్ ప్రసాద్ నిర్మాతగా నాగ శౌర్య హీరోగా చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరగుతున్నట్లు సమాచారం. స్క్రిప్టు పూర్తైన వెంటనే త్వరలో చిత్రం షూటింగ్ మొదలుకానుంది. 'అలా మొదలైంది' తరహాలోనే కొత్త తరహా రొమాంటిక్ కామెడీ ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. ఇక నాగ చైతన్య వరస చిత్రాలతో బిజీగా ఉన్నారు.
నాగ శౌర్య తాజా చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి' విషయానికి వస్తే...
నాగశౌర్య, అవికా గోరే హీరోహీరోయిన్లుగా గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి'. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. పాత్రలకు తగిన నటీనటుల్ని ఎన్నుకోవడంతో చిత్రం బాగా వచ్చింది. కె.ఎం.రాధాకృష్ణన్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకొన్న పాటలు వీనుల విందుగా ఉంటాయి. ఆడియోతో పాటు సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకం ఉందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.
నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ- ఓ మంచి కథాంశంతో సినిమా రూపొందించాలన్న తన కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందని, దర్శకుడు రవి మంచి కథ చెప్పడంతో మొదలెట్టామని, అవికాగోర్ హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ చిత్రానికి మరింత అందం వచ్చిందని తెలిపారు. ‘ఇడియట్'లో రవితేజకు వచ్చినంత పేరు కథానాయకుడు శౌర్యకు ఈ చిత్రం ద్వారా వస్తుందని, ఆయన అన్నారు.
కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని లవ్ ఎంటర్టైనర్గా అందిస్తున్నామని, మంచి టీమ్ కుదరడంతో సినిమా కూడా బాగా వస్తుందన్న నమ్మకం ఉందని దర్శకుడు నంద్యాల రవి తెలిపారు.
ఈ సినిమాలో తన పాత్ర గూర్చి తెలియగానే ఆ పాత్రతోనే తాను ప్రయాణిస్తున్నానని, అంతగా నచ్చిన ఈ పాత్ర సినిమా అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం హీరోయిన్ అవికాగోర్ వ్యక్తం చేసింది.
షాయాజీషిండే, అలీ, సత్యం రాజేశ్, రావు రమేశ్, అనితా చౌదరి, ప్రగతి, భగవాన్, శశి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాలరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కుంపట్ల రాంబాబు, సమర్పణ: తాడిశెట్టి వెంకట్రావు, కథ, మాటలు, స్ర్కీన్ప్లే, దర్శకత్వం: నంద్యాల రవి.